తెలంగాణ సీఎం కేసీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్పై వివరణ కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్లో ఆరోపించారు. ఆయనపై 64 కేసులు ఉంటే కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపించారని అందులో పేర్కొన్నారు.
అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్తో పాటు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Lok Sabha Election 2019, Telangana, Telangana Assembly, Telangana Election 2018, Telangana Lok Sabha Elections 2019, Telangana Politics