ఈ నెల 21 నుంచి జరగాల్సిన రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 3,342 స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అలాగే 26,191 వార్డులకు గాను 63,480 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇక ఈ నెల 30 నుంచి జరగనున్న మూడో విడుత పంచాయతీ ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మూడో విడుతలో 4116 సర్పంచ్ స్థానాలు, 36,729 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gram Panchayat Elections, Telangana, Trs, TS Congress