తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న 23 స్థిరాస్తులను విక్రయించడానికి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వానికి హక్కు ఉందని, దాన్ని విక్రయించే హక్కు లేదని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది? వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారు? దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందనే అనుమానం ఉంది. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుంది.’ అని కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
టిటిడి ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది?
వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారు.?
దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందనే అనుమానం ఉంది.టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బిజెపి రాజీ లేని పోరాటం చేస్తుంది. pic.twitter.com/ttAwxzpQ73
మిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటి విలువ కోటి 50 లక్షల రూపాయలుగా గుర్తించిన టీడీపీ...టెండర్ల ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 30న కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. నిరర్థకమైన ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 100 కోట్లు సమకూర్చుకోవాలని భావించిన టీటీడీ... 2020-21 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.