గుండె నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచామని, మెడికేషన్ కొనసాగుతోందని తెలిపారు. గుండె నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఎయిమ్స్లోని కార్డియోవాక్యులర్ సెంటర్లో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగా ఉందని, ఎలాంటి ఇబ్బండి పడటం లేదని స్పష్టం చేశారు.
కాగా, 2009లో ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అయితే,ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో సన్నిహితులు ఆయన్ను రాత్రి 8.45 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.