మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు, దేశవ్యాప్తంగా 51 ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నవేళ.. రాజకీయ పార్టీలు భారీ ఎత్తున స్వీట్లు ఆర్డర్ ఇచ్చాయి. పార్టీల వారీగా భారీ ఎత్తున స్వీట్లు ఆర్డర్ ఇవ్వగా, గెలుస్తామని భావిస్తున్న వారు కూడా స్వీట్లు ఆర్డర్ చేశారు. దీంతో మిఠాయి దుకాణాల్లో కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి స్వీట్లు తయారు చేస్తున్నారు. మహారాష్ట్రలో గెలుపు మీద బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కౌంటింగ్ ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున స్వీట్ ప్యాకెట్లు రెడీ చేశారు. ముంబైలోని బీజేపీ ఆఫీసులో ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు లైవ్ కవరేజ్ను ఏర్పాటు చేశారు. మరోవైపు సెలబ్రేషన్స్ కోసం సుమారు 5వేల లడ్డూలను సిద్ధం చేశారు. వీటితోపాటు జెండాలు, దండలు కూడా రెడీగా ఉంచారు. రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. దీంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజవకర్గాలు, హర్యానాలో 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈనెల 21 పోలింగ్ జరిగింది. దీంతోపాటు 51 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. వాటికి ఈ రోజు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ముందుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.