హోమ్ /వార్తలు /రాజకీయం /

Pulwama Attack : మోదీని టార్గెట్ చేయబోయి ఇరుక్కున్న దిగ్విజయ్..

Pulwama Attack : మోదీని టార్గెట్ చేయబోయి ఇరుక్కున్న దిగ్విజయ్..

దిగ్విజయ్ సింగ్ (File)

దిగ్విజయ్ సింగ్ (File)

Digvijay Singh on Pulwama Attck : పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట‌్‌పై భారత్ జరిపిన దాడి గురించి ట్విట్టర్‌లో దిగ్విజయ్ పలు అనుమానాలు లేవనెత్తారు. బాలాకోట్‌ దాడిపై ఇంటర్నేషనల్ మీడియా అనుమానాలు లేవనెత్తిందని, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోందని అన్నారు.

ఇంకా చదవండి ...

    కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి ఘటనపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాకతాళీయంగా అన్నారో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు గానీ పుల్వామా దాడిని 'ప్రమాద ఘటన'గా అభివర్ణించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసి 40మంది భారత జవాన్లను బలి తీసుకుంటే దాన్ని ప్రమాదంగా అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది.


    పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట‌్‌పై భారత్ జరిపిన దాడి గురించి ట్విట్టర్‌లో దిగ్విజయ్ పలు అనుమానాలు లేవనెత్తారు. బాలాకోట్‌ దాడిపై ఇంటర్నేషనల్ మీడియా అనుమానాలు లేవనెత్తిందని, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ లేదా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికైనా దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. బాలాకోట్ దాడిలో అసలెంత మంది చనిపోయారో లెక్క చెప్పాలన్నారు. బాలాకోట్‌పై భారత వైమానిక దాడిని మీరు, మీ మంత్రులు సాధించిన విజయంగా చూడటం భద్రతా బలగాలను అవమానించడమేనని మోదీని ఉద్దేశించి విమర్శించారు.


    బాలాకోట్ దాడిలో 300మంది ఉగ్రవాదులు చనిపోయారని మీ మంత్రులు కొందరు చెబుతున్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా 250మంది అంటున్నారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 400మంది అంటున్నారు. కేంద్రమంత్రి అహుల్‌వాల్యా అసలు ఒక్కరు కూడా చనిపోలేదని చెబుతున్నారు. మీరు మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు అబద్దాలు చెబుతున్నారు.. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో దేశం తెలుసుకోవాలనుకుంటోంది.
    దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత


    దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్‌కు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంటుతో ఆడుకోవడం.. ఆర్మీ సమాచారాన్ని కూడా తోసిపుచ్చడం ఏంటన్నారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ సొంత సైన్యాన్ని నమ్మని ప్రజలంటూ ఉండరని, అలాంటిది కాంగ్రెస్ మాత్రం అనుమానాలను లేవనెత్తుతోందని విమర్శించారు.




    ఇది కూడా చదవండి : బాలాకోట్‌లో ఏరిపారేసింది ఉగ్రవాదులనా లేక చెట్లనా? : మోదీపై సిద్దూ సెటైర్

    First published:

    Tags: Digvijaya Singh, Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir security, Narendra modi, Pakistan, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు