news18-telugu
Updated: September 12, 2019, 1:19 PM IST
సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.ప్రజాతీర్పును బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.మహాత్మాగాంధీ,సర్దార్ పటేల్,అంబేడ్కర్ వంటి మహానీయుల సందేశాలను వక్రీకరిస్తూ తమ ఎజెండా కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందని.. అన్ని రంగాల్లో నష్టాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. వీటి నుంచి
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గురువారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన సందర్భంగా సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎజెండా ఉండాలని.. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సరిపోదని చెప్పారు. ప్రజలకు-కాంగ్రెస్కు మధ్య
కొంత గ్యాప్ ఏర్పడిందని.. ప్రజల్లోకి వెళ్లడం పార్టీకి ఇప్పుడు చాలా కీలకమని అన్నారు. ఇది మన శక్తియుక్తులకు ఒక పరీక్ష లాంటిది అని అభిప్రాయపడ్డారు.
Published by:
Srinivas Mittapalli
First published:
September 12, 2019, 1:19 PM IST