పని తక్కువ... యాక్షన్ ఎక్కువ... కేసీఆర్పై కాంగ్రెస్ నేత సెటైర్
ఎన్ని ఆంక్షలు పెట్టినా కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్ను సక్సస్ చేశారని వీహెచ్ అన్నారు.
news18-telugu
Updated: November 11, 2019, 7:47 PM IST

సీఎం కేసీఆర్(ఫైల్ పోటో)
- News18 Telugu
- Last Updated: November 11, 2019, 7:47 PM IST
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పని తక్కువ యాక్షన్ ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్ను సక్సస్ చేశారని వీహెచ్ అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ పేరుతో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయని వీహెచ్ తెలిపారు. గోల్నాక ఫంక్షన్ హాల్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు అధికారులు,మంత్రులు వెళ్లకపోవడం బాధాకారమని అన్నారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు సరికాదని ఆయన అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు.
గాంధీ కుటుంబం లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తోందని వీహెచ్ మండిపడ్డారు. వారికి ఏం జరిగినా మోదీ, అమిత్ షా దే బాధ్యత అని ఆరోపించారు. వారి భద్రత పునరుద్ధరించకపోతే దేశం భగ్గుమంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అనడం విచారకరమని వీహెచ్ వ్యాఖ్యానించారు. బీజేపీని గెలిపించడానికే అసద్ మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ ఖతం అయిందని వీహెచ్ అన్నారు.
కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఢిల్లీలో మాస్టర్ ప్లాన్...
కవితకు వాళ్లబ్బాయి పంపించిన ఫన్నీ కొటేషన్.. ఏంటో తెలుసా..?
ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటారు.. ఇక్కడేమో.. : టీఆర్ఎస్పై లక్ష్మణ్ విసుర్లు
కేసీఆర్కు ఈసారైనా ఛాన్స్ ఇస్తారా ?
'మద్యం వల్లే దిశ హత్య'.. కేసీఆర్ను టార్గెట్ చేసిన బీజేపీ
కవితకు కీలక పదవి... కేసీఆర్ సంకేతాలు...టీఆర్ఎస్లో చర్చ