news18-telugu
Updated: December 11, 2019, 10:06 AM IST
ఏపీ సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ... సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీపై జగన్ గతంలో చేస్తున్న వ్యాఖ్యల్ని... మంగళవారం అసెంబ్లీలో చేసిన కామెంట్స్ను సరిపోల్చుతూ... జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ‘పేరు జగన్ ఇంటి పేరు యూటర్న్ ’ అనే హెడ్డింగ్తో జనం ఎన్నికలకు ముందు... తాజాగా అసెంబ్లీలో సన్నబియ్యంపై చేసిన వ్యాఖ్యల్ని పోస్టు చేశారు.
ఏపీలో సన్నబియ్యంపై అచ్చెన్నాయుడు సభలో వ్యాఖ్యలు చేయగా... ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వాటిని తోసిపుచ్చారు. మధ్యలో సీఎం జగన్ కూడా కలుగచేసుకొని... అసలు సన్నబియ్యం అన్న పదమే లేదన్నారు. ప్రజలు తినగలిగిన, నాణ్యమైన స్వర్ణతో పాటు, అలాంటి ఇతర రకాల బియ్యం సరఫరా చేస్తామని మాత్రమే తాను గతంలో చెప్పానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా జగన్ సభలో ప్రసారం చేశారు. ప్రజలకు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ ‘సాక్షి’ పత్రికలో తప్పుగా రాశారని స్పష్టం చేశారు. ‘‘మీ లాగానే వాళ్లూ అయోమయానికి గురయ్యారు. తప్పుగా రాశారన్నా జగన్.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 11, 2019, 10:05 AM IST