news18-telugu
Updated: December 10, 2019, 10:33 AM IST
జగన్, అచ్చెన్నాయుడు. కొడాలి నాని
శాసనసభ అంటే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్రజాసమస్యలపైన చర్చిస్తూనే.. ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల దాడులు చేసుకుంటారు. ఏపీలో ప్రస్తుతం జగన్ పార్టీ అధికారంలో ఉంది. అటు చంద్రబాబు పార్టీ టీడీపీ ఐదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చొంది. దీంతో రెండు పార్టీలో సభలో నువ్వా నేనా అన్నట్లు కాలు దువ్వుకుంటున్నాయి. ఛలోక్తులు విసురుకుంటూ ఒకరిపై ఒకరు మాటలతో దాడికి దిగుతున్నారు. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అచ్చెన్నాయుడును సీఎం జగన్, మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.
సభలో వైసీపీ నేతలు నాలెడ్జ్ పెంచుకోవాలంటూ... అచ్చెన్నాయుడు అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. ఆ తర్వాత కాసేపటికే అచ్చెన్నాయుడ్ని కామెంట్స్ పై సెటైర్లు వేశారు కొడాలి నాని. సన్నబియ్యం మీద ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. కొడాలి నాని మాట్లాడుతుంటే అచ్చెన్నాయుడు అడ్డుపడుతుంటే.. కొడాలి నాని విమర్శల దాడి చేశారు. నాల్డెజ్ అనేది బాడీలో ఉండదు బ్రెయిన్లో ఉంటుందంటూ అచ్చెన్నపై సెటైర్లు వేశారు. ఆ తర్వాత జగన్ కూడా సన్నబియ్యంపై క్లారిటీ ఇస్తూ.. బియ్యం గురించి తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకోండి అంటూ అచ్చెన్నపై వ్యంగస్త్రాలు విసిరారు. అసలు సన్నబియ్యం అన్న పదమే లేద్నారు. తమ మేనిఫెస్టో ఎక్కడ సన్నబియ్యం ప్రతిపాదన లేద్నారు. మొత్తం మీద టీడీపీ నేత అచ్చెన్నాయుడ్ని అధికార పార్టీ నేతలు ఆడుకుంటున్నారని ప్రజలు, పలు రాజకీయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 10, 2019, 10:33 AM IST