వివాదాస్పద నేతగా ముద్రపడ్డ భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. బుధవారం భోపాల్లోని మఖన్లాల్ చతుర్వేది యూనివర్సిటీకి వెళ్లిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కి వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు నినాదాలు చేశారు.'టెర్రరిస్ట్ గో బ్యాక్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులైన శ్రేయ పాండే,మనుశర్మలను కలిసేందుకు ప్రజ్ఞాసింగ్ అక్కడికి వెళ్లారు. అటెండెన్స్ తక్కువున్న కారణంగా ఇటీవల వారిద్దరిని సస్పెండ్ చేశారు.దాన్ని నిరసిస్తూ ఆ ఇద్దరు విద్యార్థులు నిరసనకు దిగగా.. ప్రజ్ఞాసింగ్ వారికి మద్దతుగా అక్కడికి వెళ్లారు.
ప్రజ్ఞాసింగ్ రాకతో బీజేపీ మద్దతుదారులు,విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 'ఉగ్రవాది క్యాంపస్ నుండి వెళ్లిపోవాలి' అంటూ విద్యార్థులు నినదించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారతుండటంతో చివరకు పోలీసులు రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడినుంచి పంపించేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే యూనివర్సిటీలో విద్యార్థులు తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని ప్రజ్ఞాసింగ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించి చట్టపరమైన చర్యలకు దిగాలని భావిస్తున్నారు. కాగా,ఇటీవల స్పెస్జెట్ విమానంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగి ప్రజ్ఞాసింగ్ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే.
#WATCH Bhopal: NSUI workers raise "aatankwadi wapas jayo" & "Pragya Thakur, go back" slogans at Makhanlal Chaturvedi University. BJP MP Pragya Thakur had gone there to meet female students who were sitting on a 'dharna' against the university, over attendance issue. (25.12.19) pic.twitter.com/HKU1tZqoBY
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.