Assembly Election 2022: ఉత్తర ఖండ్ లోను బీజేపీ ఘన విజయం..
బీజేపీ పతాకం (ఫైల్)
Uttara Khand: దేవ భూమి ఉత్తరాఖండ్ (Uttarakhand) లోనే కాషాయ జెండా రెపరెప లాడింది. భారతీయ జనాతా పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ బీజేపీకి ప్రజలు మరొసారి బ్రహ్మరథం పట్టారు. వరుసగా మరొసారి బీజేపీ విజయం సాధించింది.
Uttara Khand: దేవ భూమి ఉత్తరాఖండ్ (Uttarakhand) లోనే కాషాయ జెండా రెపరెప లాడింది. భారతీయ జనాతా పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ బీజేపీకి ప్రజలు మరొసారి బ్రహ్మరథం పట్టారు. వరుసగా మరొసారి బీజేపీ విజయం సాధించింది.
దేవ భూమి ఉత్తర ఖండ్ లో 70 నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉత్తర ఖండ్ (Assembly Elections 2022) 59.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి నెలకొంది. దీంతో ఇక్కడ బీజేపీ మరొసారి అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ , బీజేపీ నువ్వా నేనా.. అన్నరీతిలో పోటీపడ్డాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 36. ఇక్కడ మరోసారి కమల దళం అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి.
పలు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా... నేనా అన్న రీతిన ప్రచారాలు నిర్వహించాయి. అయితే.. ఉత్తర ప్రదేశ్ , గోవాలలో ప్రజలు.. బీజేపీకి భారీ మెజార్టీతో విజయం అందించారు. అయితే, బీజేపీకి ఉత్తరఖండ్ లో ఊహించని పరాభవం ఎదురైంది. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. దాదాపు 6 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు.
అయితే, ప్రజలు బీజేపీకి మెజార్జీని అందించారు. రెండో సారి బీజేపీ వరుసగా ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఉత్తర ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 36. అయితే, బీజేపీ 48 సీట్లను సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ 18 సీట్లను సాధించింది. ఇతరులు నాలుగు స్థానాలు సాధించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.