పోలవరం రివర్స్ టెండర్లతో రూ. 800 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కాలువల టెండర్లలో రూ. 58 కోట్లు మిగిలాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పుకొచ్చారు. రూ. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్ రూ. 4,359 కోట్లకు వచ్చిందని అనిల్ వివరించారు. గతంలో తాము చేసిన దోపిడి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ వెనకేసుకొస్తున్న నవయుగ కంపెనీ రివర్స్ టెండరింగ్లో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్కు కూడా త్వరలోనే రివర్స్ టెండరింగ్ చేస్తామని అన్నారు.
నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని అనిల్ తెలిపారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే... టీడీపీని మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? ఏపీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. డిజైన్ ప్రకరామే పోలవరం నిర్మాణం జరుగుతుందని... ఎత్తు తగ్గించబోమని స్పష్టం చేశారు. దేవినేని కూర్చుని మాట్లాడిన స్థలం కూడా ఇరిగేషన్ శాఖదే అని మంత్రి అనిల్ అన్నారు. ఏడాదికి రూ. వెయ్యి లీజ్తో ఉంటూ నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము రివర్స్ టెండరింగ్కు వెళ్లకపోతే... ఆ డబ్బు టీడీపీ జేబులోకి వెళ్లేదని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anil kumar yadav, Ap cm jagan, Polavaram, TDP