ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్ను జగన్ సర్కారు ఉపసంహరించుకుంది. సుప్రీం కోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో స్టే పిటిషన్ను వెనక్కి తీసుకుంది. అంతేకాదు.. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్ను కూడా వెనక్కి తీసేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగించాల్సిందేనని మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దాన్ని సవాలు చేసిన జగన్ సర్కారు.. హైకోర్టులో ముందుగా స్టే పిటిషన్ను దాఖలు చేసింది. అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో దాన్ని ఉపసంహరించుకుంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.