ఈరోజు ప్రశ్నాపత్రాలను లీక్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల పేరిట భారీ స్కాం చేసారు. లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు. వారి భవితకు ఉరేశారు. ఏంటి తమషాలా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
— N Chandrababu Naidu (@ncbn) September 20, 2019
క్వశ్చన్ పేపర్ని ఏపీపీఎస్సీ తయారు చేసిందని.. ఆ టీమ్లో పనిచేసిన ఓ మహిళ గ్రామ సచివాలయ పరీక్ష రాసిందని ఆరోపణలున్నాయి. పరీక్షల్లో ఆమెనే టాపర్గా నిలిచందని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరు కూడా టాపర్లగా నిలిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరీక్షల్లో గూడూపుఠాణి నడించిందని, కొందరికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిపారేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని..ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశమే లేదని స్పష్టంచేశారు.ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, మీ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారు. ఒక్కో ఉద్యోగాన్ని 5 లక్షలకు అమ్ముతున్నారనే వార్తలపై స్పందించలేదెందుకు? ఆశలు అడియాశలైన నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కట్టి చెల్లిస్తారా? #YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 20, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu naidu, JOBS, Nara Lokesh, Ys jagan