AP CM YS JAGAN SATIRICAL COMMENTS ON CHANDRABABU BS
మీ అత్తగారే.. చంద్రబాబుకు చురకలంటించిన జగన్..
సీఎం జగన్కు 48 గంటల సమయం ఇస్తున్నామన్న చంద్రబాబు... అమరావతి అంశంపై అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన వారి వివరాలను సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి పేరు చదువుతూ రోజా, లక్ష్మీ పార్వతి గురించి ప్రస్తావించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రక్తికట్టిస్తున్నాయి. స్పీకర్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు.. సస్పెన్షన్ చేయాలంటూ వైసీపీ నేతల డిమాండ్.. చంద్రబాబును స్పీకర్ మన్నించి వదిలేయడం.. ఇలా అన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. మూడో రోజు సభ ప్రారంభం కాగానే.. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ ఆందోళన చేపట్టింది. స్పీకర్కు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నోరు జారారు. మర్యాదగా ఉండదంటూ వ్యాఖ్యానించడం సభలో గందరగోళాన్ని సృష్టించింది. అయితే.. ఈ వ్యవహారం సద్దుమనిగాక సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన వారి వివరాలను సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి పేరు చదువుతూ రోజా, లక్ష్మీ పార్వతి గురించి ప్రస్తావించారు.
లక్ష్మీపార్వతి పేరు ప్రస్తావిస్తున్న క్రమంలో ఆమెను తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నియమించామని చెప్పారు. వెంటనే ‘ఆమె.. ఆయన(చంద్రబాబు) అత్తగారే’ అంటూ టీడీపీ అధినేతకు చురకలు అంటించారు. ఈ మాట అనగానే సభలో ఉన్న వైసీపీ నేతలందరూ చప్పట్లతో, బల్లలు చరుస్తూ నవ్వేశారు. ఇలా.. సభ అత్యంత ఆసక్తికరంగా మారింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.