ANDHRA PRADESH STATE ELECTION COMMISSION ISSUES ORDERS POLICE TO FILE CASE ON MINISTER KODALI NANI OVER BREACHING ELECTION CODE OF CONDUCT HERE ARE THE DETAILS PRN
SEC vs Kodali Nani: మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ మరో షాక్.. కేసు నమోదు చేయాలని ఆదేశం
నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh kuamar), మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) మధ్య వివాదం మరింత ముదిరింది. శుక్రవారం కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పటి నుంచి 24 గంటల్లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మధ్య వివాదం మరింత ముదిరింది. శుక్రవారం కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పటి నుంచి 24 గంటల్లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఎస్ఈసీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషనర్.. మంత్రి ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపి వివరణ కోరింది.
మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం
ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని.. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.
అలాగే ఎస్ఈసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తమవని.. వాటిని ఖండిస్తున్నట్లు నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు నమ్మకం ఉందని.. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అంటే గౌరవముందన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్న మంత్రి కొడాలి నాని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రేషన్ డోర్ డెలివరీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికే మీడియాతో మాట్లాడానే తప్ప ఎస్ఈసీని దూషించడానికి కాదన్నారు.
కొడాలి నాని ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ ఆయనపై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్మీట్లతో పాటు ఎలాంటి మీటింగ్లలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడం సంచలనంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.