ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మావల వద్ద రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈనెల 11న తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.