5 State Assembly Elections Results Live Updates: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో
బీజేపీ సత్తా చాటింది. తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగింట ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh),
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో స్పష్టమైన మెజారిటీ కనబరించింది. గోవా (Goa)లో మ్యాజిక్ నెంబర్ 21కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది. 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐతే ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. మణిపూర్((Manipur Assembly Election 2022 result) )లోనూ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఇతర పార్టీల మద్దతులతో అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలుపుకోనుంది కమలం పార్టీ.
యూపీలో బీజేపీ ఘన విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రైతులు ఆందోళనలు ఎక్కువగా జరిగిన పశ్చిమ యూపీలో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. రైతుల ఆందోళనలు ఎన్నికల్లో ప్రభావం చూపవని హోంమంత్రి అమిత్ షా ఇది వరకే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు బీజేపీకే వచ్చాయి. బీజేపీకీ ఈసారి సీట్లు తగ్గినా.. గతం కంటే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. సీఎంగా యోగి రెండో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐతే 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్కు చెందిన ఎన్డీ తివారి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వరుసగా రెండోసారి సీఎంగా పనిచేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు యోగి ఆ ఘనత సాధించారు.
పంజాబ్ (Punjab Assembly Election 2022 result)లో మాత్రం
ఆప్ దుమ్మురేపింది. అకాలీదళ్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలను ఆమాద్మీ చీపురు ఊడ్చేసింది. అక్కడ వార్ వన్ సైడ్ అయింది. స్పష్టమైన మెజారిటీతో ఆప్ దూసుకెళ్లింది. సామాన్య ప్రజలే అక్కడ రాజకీయ ఉద్దండులను ఓడగొట్టారు. సీఎం ఛన్నీతో పాటు మాజీ సీఎంలను కూడా మట్టి కరిపించారు. భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాను సీఎం అయ్యాక..తొలి సంతకం నిరుద్యోగ నిర్మూలపైనే చేస్తానని ఆయన ప్రకటించారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand Assembly Election 2022 result)లో బీజేపీ,
కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. అలాంటి ఫలితాలు కనిపించడం లేదు. ఉత్తరాఖండ్లో స్పష్టమైన మెజారిటీతో సాధించింది. ఐత సీఎం పుష్కర్ ధామి ఓడిపోవడం పార్టీ వర్గాలు జీర్ణించుకోవడం లేదు. విపక్ష నేత, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా ఓటమి పాలయ్యారు. మొత్తంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కమలం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.