తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు... ఎన్నికలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... అన్నాడీఎంకేకి ఓటు వేస్తే అది నరేంద్ర మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. జల్లికట్టును నిషేధించి మోదీ... తమిళ ప్రజల సంస్కృతిని అవమానపరిచారని అన్నారు. కరుణానిధి వారసుడు స్టాలిన్ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అన్న చంద్రబాబు... ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగ వ్యవస్థల్నీ పరిరక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యం కోసం ఎన్నో రోజులుగా పోరాడుతున్నానన్న ఆయన... వీవీప్యాట్ స్లిప్పులలో 50 శాతం లెక్కించాల్సిందేనని మరోసారి పట్టుపట్టారు. ఈ విషయంపై ఇంకోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.
ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పోతోందన్న చంద్రబాబు... 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఆరు రోజులు పడుతుందని ఈసీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. అన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. బ్యాలెట్ విధానంలో ఫలితాలు రెండు రోజుల్లో తెలుస్తున్నప్పుడు... వీపీప్యాట్ స్లిప్పుల విషయంలోనూ అలా ఎందుకు జరగదని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ప్రేమించుకున్నారు... బ్రేకప్ అయ్యింది... ఆ తర్వాత ఆమెకు పోర్న్ ఫొటోలు పంపి...
లవర్ని ఏటీఎం కార్డులా వాడుకుని పరారైన ప్రియుడు.. కోపంతో ప్రియురాలు..
టార్గెట్ కేసీఆర్... చంద్రబాబు ప్లాన్ అదేనా... 40 రోజుల్లో ఏం చెయ్యబోతున్నారంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Tamil Nadu Lok Sabha Elections 2019