హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vijay Mallya : విజయ్ మాల్యాకు షాక్.. 4నెలల జైలుశిక్ష.. కుటుంబం ఆ డబ్బు కట్టాలి: సుప్రీంకోర్టు

Vijay Mallya : విజయ్ మాల్యాకు షాక్.. 4నెలల జైలుశిక్ష.. కుటుంబం ఆ డబ్బు కట్టాలి: సుప్రీంకోర్టు

విజయ్ మాల్యాపై సుప్రీం ఆదేశాలు

విజయ్ మాల్యాపై సుప్రీం ఆదేశాలు

విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ధిక్కరణ కేసులో మాల్యాకు 4నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును మాల్యా కుటుంబం కట్టాలని పేర్కొంది.

దేశంలో బ్యాంకులను ముంచేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా (Vijay Mallya)కు సుప్రీంకోర్టు (supreme court) షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు 4నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. మాల్యా అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆయన కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది.

KCR కుటుంబంలోనే ఏక్‌నాథ్ షిండేలు : BJP బండి తాజా బాంబు -జోగులాంబను సీఎం అవమానించారంటూ..


కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం బెంచ్ పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

Amarnath Tragedy | AP : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల్లో ఇంకా 37 మంది మిస్సింగ్..


మాల్యా చెల్లించాల్సిన మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని, ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్‌ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

CM KCR | BJP : అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ సవాలుతో బీజేపీ ఇరుకున పడిందా?


దాదాపు 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై నోటీసులు ఇచ్చినా మాల్యా స్పందించకపోవడంతో ధిక్కారం కింద ఇవాళ్టి ఆదేశాలు వెలువడ్డాయి.

వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను విజయ్ మాల్యా తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

First published:

Tags: Supreme Court, Vijay Mallya

ఉత్తమ కథలు