UTTAR PRADESH ELECTIONS OUR PHONES ARE BEING TAPPED AKHILESH YADAV ACCUSES YOGI HIMSELF OF LISTENING TO CONVERSATIONS EVK
Uttar Pradesh Elections: మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. యోగి స్వయంగా సంభాషణలు వింటాడు: అఖిలేష్ యాదవ్
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (ఫైల్)
Uttar Pradesh Elections | ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపిన ఒక రోజు తర్వాత, తన ఫోన్లు, తన పార్టీ నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఎస్పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Aditya Nath) తమ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు.
ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపిన ఒక రోజు తర్వాత, తన ఫోన్లు, తన పార్టీ నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఎస్పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆదివారం ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Aditya Nath) తమ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఆదివారం లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ.. “మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు. ఇందులో SP కార్యాలయం మరియు మాతో ఉన్న వ్యక్తుల నుంచి చేసిన కాల్లు ఉన్నాయి. సాయంత్రం రికార్డింగ్లను సీఎం స్వయంగా వింటారు. ఇది పనికిమాలిన ప్రభుత్వం మనది. మీరు నన్ను సంప్రదించినట్లయితే, మా సంభాషణ యొక్క రికార్డింగ్లు కూడా వినబడతాయని నేను మీ అందరినీ హెచ్చరించాలి.
“పనికిరాని ముఖ్యమంత్రి” ఆదేశాల మేరకే ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. "ఎక్కడ ఎన్నికలు జరిగినా, బిజెపి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తుందని.. ఈ ఎన్నికల్లో నన్ను టార్గెట్ చేస్తోందని అఖిలేష్ అన్నారు. అఖిలేష్తో పాటు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్ ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) అభివృద్ధి పథకాల ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అంతా చుట్టివేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి పక్షాలపై ఐటీ దాడులు ఉత్తర్ ప్రదేశ్లో హాట్ టాపింగ్ మారాయి. శనివారం సమాజ్వాదీ పార్టీ నేతల ఇళ్లపై దాడులను అఖిలేశ్ యాదవ్ ఖండించారు. "బీజేపీలో ఓటమి భయం ఎంత పెరుగుతుందో దాడులు అంతే ఎక్కువగ పెరుగుతాయని" అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.
సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పలువురు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ కేంద్ర ఐటీ విభాగం సోదాలు చేస్తుండటంపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో నాడు కాంగ్రెస్ చేసిన పనే నేడు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. ఐటీ దాడులను ముందే ఊహించామని, రాబోయే రోజుల్లో సీబీఐ, ఈడీ లాంటి సంస్థల నుంచి బెదింరింపులు వస్తాయని అఖిలేశ్ అన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.