హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పొంచి ఉన్న కరోనా ముప్పు.. మూత పడిన ఆక్సిజన్ ప్లాంట్.. ఎక్కడో తెలుసా..?

పొంచి ఉన్న కరోనా ముప్పు.. మూత పడిన ఆక్సిజన్ ప్లాంట్.. ఎక్కడో తెలుసా..?

ఆక్సిజన్ పవర్ ప్లాంట్

ఆక్సిజన్ పవర్ ప్లాంట్

Uttar Pradesh: అమేథీలోని జిల్లా ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ​​ప్లాంట్‌ మూతపడింది. ఆక్సిజన్‌ ​​ప్లాంట్‌ మూతపడడంతో ఆక్సిజన్‌ ​​సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ గురించి ఆరోగ్యశాఖ కూడా పట్టించుకోవడం లేదు.

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. గతంలో కరోనా పరిస్థితులలో వందలాది మందికి ఆక్సిజన్ కొరత లేకుండా చూసిన ప్లాంట్ ను ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో నిర్వహణకు తగినంత నిధులు లేక అది ప్రస్తుతం అది మూతపడింది. దీంతో స్థానికులు, రోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అమేథీలోని జిల్లా ఆస్పత్రిలో సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ​​ప్లాంట్‌ మూతపడింది.

ఆక్సిజన్‌ ​​ప్లాంట్‌ మూతపడడంతో ఆక్సిజన్‌ ​​సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ పట్ల ఆరోగ్యశాఖ కూడా పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితిలో, కోవిడ్ యొక్క కేసుల తీవ్రత పెరిగితే, రోగులు ఆక్సిజన్ లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

గతంలో జిల్లా ఆసుపత్రిని సామాజిక ఆరోగ్య భవనంలో నిర్వహించడం గమనార్హం. సౌకర్యాల కొరత కారణంగా, స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని 2020 అక్టోబర్ 13న జిల్లా ఆసుపత్రిని నూతన భవనంలో ప్రారంభించారు. సీఎస్ ఆర్ ఫండ్ కింద మొత్తం జిల్లాలో జిల్లా ఆస్పత్రితో పాటు 7 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

ఆక్సిజన్ ప్లాంట్ ను పట్టించుకోని అధికారులు

ఆక్సిజన్‌ ​​ప్లాంట్‌ గత కొన్ని నెలలుగా మూతపడింది. అయితే ఆ తర్వాత కూడా వైద్యారోగ్యశాఖ ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. అయితే జిల్లాలో ప్రస్తుతం.. ఆక్సిజన్‌ ​​కొరత లేదని, ఆక్సిజన్‌ ​​సిలిండర్‌తో పాటు ఆక్సిజన్‌ ​​కాన్‌సెంట్రేటర్‌, ఇతర వనరులు ఆరోగ్యశాఖ వద్ద ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంటోంది.

సీఎంవో ఏం చెప్పిందంటే..

ఆక్సిజన్ ప్లాంట్ కు సంబంధించి అమేథీ సీఎంవో డాక్టర్ విమలేంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ప్లాంట్ మూతపడిన విషయం ఆరోగ్యశాఖకు తెలిసిందే. దీని కోసం ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించగా ప్రభుత్వం ఇటీవల మెకానిక్‌ను పంపి మరమ్మతులకు చేయడానికి సూచనలు చేసింది. 15 రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామన్నారు. అప్పటి వరకు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

First published:

Tags: Covid, Uttar pradesh

ఉత్తమ కథలు