news18-telugu
Updated: September 15, 2019, 11:07 PM IST
నితిన్ గడ్కరీ
పారిశ్రామిక రంగం ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని ఈ విషయం తనకు తెలుసునని, అయితే వృద్ధి రేటు పెరగాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. విదర్భ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 65వ వ్యవస్థాపక దినోత్సవంలో గడ్కరి మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు ధైర్యం కోల్పోవద్దని గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాదు ఇటీవలే తాను ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల ఆల్ ఇండియా కన్వెన్షన్లో పాల్గొని సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసానని తెలిపారు. జీవితమంటేనే సైకిల్ చక్రంలాంటిందని దేశ ఆర్థిక మందగమనం కూడా తాత్కాలికమైనదేనని అధైర్యపడవద్దని గడ్కరీ కోరారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అత్యంగా వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
అంతేకాదు ప్రస్తుతం వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన లేదని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆటోఇండస్ట్రీకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుందని, త్వరలోనేు ఈ పరిస్థితికి ఒక పరిష్కారం కనుగొంటామని గడ్కరీ భరోసా ఇచ్చారు.
Published by:
Krishna Adithya
First published:
September 15, 2019, 11:07 PM IST