జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల కాన్వాయ్పై కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొనే లోపే బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన PCR హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
#UPDATE Two Police personnel lost their lives and one injured in the firing by terrorists in Nowgam. Area cordoned off. More details awaited. (visuals deferred by unspecified time). #JammuAndKashmir https://t.co/8oecUfOKqv pic.twitter.com/l9xEG35vUS
— ANI (@ANI) August 14, 2020
జైషే మహమ్మద్ ఉగ్రవాదులే కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఆర్మీ అప్రమత్తమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఉగ్రవాదుల దాడి జరగడంతో అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ వ్యాప్తంగా అదనపు బలగాలు భారీగా మోహరించాయి. పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం నగరమంతటా గాలిస్తున్నారు. కాగా, పుల్వామా జిల్లా అవంతిపొరాలో జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీకి చెందిన 50 రాష్ట్రీయ రైఫిల్స్, 130 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Srinagar, Terror attack