మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 అనే రెండు విమానాలు కూలిపోయాయి. ఘటన స్తలంలో విమానశకలాలు తునాతునకలైపోయినట్లుగా గుర్తించారు.పైలట్లు సకాలంలో బయటపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లుగా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ బగ్రీ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కుప్పకూలిన విమానాలు..
ప్రమాదానికి గురైన రెండు విమానాలు రక్షణ వర్గాలకు చెందిన విమానాలేనని తెలుస్తోంది.అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఏమిటి...ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023
వరుసగా రెండు ఘటనలు..
ఈసంఘటనకు కొద్ది నిమిషాల ముందు రాజస్థాన్లో కూడా ఓ చార్టర్డ్ విమానం కూలింది. రాజస్థాన్లోని భరత్పూర్లోని నాగ్లా దిడాలో ఫైటర్ విమానం కూలిపోయింది. ఘటనా స్థలానికి పోలీసులను, అధికార యంత్రాంగాన్ని పంపించినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని, పైలట్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని ఒక అధికారి తెలిపారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
#WATCH | Rajasthan, Bharatpur | Wreckage of jet seen. Earlier report as confirmed by Bharatpur District Collector Alok Ranjan said charter jet, however, defence sources confirm IAF jets have crashed in the vicinity. Therefore, more details awaited. pic.twitter.com/005oPmUp6Z
— ANI (@ANI) January 28, 2023
ప్రమాద దృశ్యాలు..
ఈవార్తలపై ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ మీకు న్యూస్18 తెలుగు అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Rajasthan