దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గురువారం మధ్యాహ్నం కాశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి.. పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. ఉదమ్పూర్ జిల్లాలోని మంతల్ ప్రాంతంలో కాళీమాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటల ధాటికి లారీలో ఉన్న సిలిండర్ల ఒక్కొక్కటిగా పేలాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు జరగడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి జరిగిందేమోనని భయపడ్డారు. సుమారు 45 నిమిషాల పాటు పేలుళ్లు జరిగినట్లు తెలిసింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపైనే ఈ ఘటన జరగడంతో.. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐతే ఘటనా సమయంలో లారీలో ఎవరూ లేరని.. రోడ్డుపక్కన లారీని పార్క్ చేసిన సమయంలో పేలుళ్లు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.
#WATCH Jammu & Kashmir: A truck carrying LPG cylinders caught fire on its way to Kashmir in Manthal area of Udhampur district; Movement of vehicles on both sides of the road has been stopped. More details awaited. pic.twitter.com/UcSz3dgDLa
— ANI (@ANI) May 29, 2020
Dozens of LPG cylinders explode in over 45 minutes after truck carrying these caches fire on Jammu-Srinagar national highway in Udhampur district: Officials
— Press Trust of India (@PTI_News) May 29, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Kashmir, LPG Cylinder