2016 నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షలో ఉన్న 'లక్ష్మణ రేఖ' గురించి తమకు తెలుసని, అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం అప్రస్తుత అంశంగా మారిందా లేదా అనే విషయాన్ని నిర్ణయించడానికి నోట్ల రద్దు విషయాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రం, RBI (Reserve Bank Of India)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. అంతేకాదు దీనిపై సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త..దీపావళి కానుకగా భారీ బోనస్ ప్రకటన
కేంద్రం తరపున హాజరైన సొలిసిటల్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..అప్రస్తుత సమస్యలపై కోర్టు సమయాన్ని వృథా చేయరాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ వివేక్ నారాయణ్ శర్మ తరపున సీనియర్ న్యాయవాది ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచాలని పేర్కొన్నారు. ధర్మసనం సమయం వృథా అనే పదాలు తనను ఆశ్చర్యపరిచాయని సీనియర్ న్యాయవాది అన్నారు. మరో సీనియర్ న్యాయవాది చిదంబరం మాట్లాడుతూ..ఈ సమస్య అకడమిక్ గా మారలేదని, ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Supreme Court