సుప్రీంకోర్టులో కొత్తగా మరో నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయే నేత్రుత్వంలోని కొలీజియం సూచన మేరకు కేంద్ర న్యాయశాఖ వారి పేర్లను ఖరారు చేసింది. వీరిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, పంజాబ్&హర్యానా చీఫ్ జస్టిస్ కృష్ణ మురారి,రాజస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.రవీంద్ర భట్,కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ హృశికేష్ రాయ్ ఉన్నారు.
కొత్తగా నలుగురి చేరికతో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నందునా.. సత్వర న్యాయ విచారణ కోసం న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిందిగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజా నియామకాలను చేపట్టింది. కేంద్రం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం సుప్రీంలో 59వేల పైచిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Delhi, Supreme Court