శ్రీలంకలో రక్తపుటేరులు పారించింది తామే అని ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడులకు పాల్పడ్డ 8 మంది ఫోటోలను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో ఏడుగురు తమ ముఖాలకు ముసుగులు వేసుకుని ఉండగా.. ముగ్గురు తమ చేతుల్లో కత్తులు పట్టుకుని నిలబడ్డారు. గుబురు గడ్డంతో చేతిలో రైఫిల్తో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ముఖానికి ముసుగు లేకుండా కనిపించాడు.
ఇంతటి మారణహోమానికి ఐసిస్ ప్రధాన కారణమైతే.. ముందస్తు సమాచారం ఉన్నా దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన శ్రీలంక ప్రభుత్వం కూడా పరోక్షంగా ఇంతమంది చావులకు కారణమైంది. శ్రీలంక ఇంటలిజెన్స్ మాత్రమే కాదు.. ఉగ్రదాడులకు సరిగ్గా రెండు గంటల ముందు భారత ఇంటలిజెన్స్ కూడా శ్రీలంకను హెచ్చరించింది. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సమాచారం అందించింది.
కాగా, శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి పెరగ్గా.. క్షతగాత్రుల సంఖ్య 500 పైచిలుకు ఉంది. మృతుల్లో 39 మంది ఉన్నట్టు తేలింది. గాయపడ్డవారిలో విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కువమందే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : SRILANKA BLASTS : పేలుళ్ల తర్వాత లంక ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Columbo Bomb Blast, Pulwama Terror Attack, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism