National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్(Money Laundering) కేసులో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మరో మూడు వారాల గడవు కోరారు కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi). తొలుత ఇచ్చిన సమన్లు మేరకు సోనియా బుధవారమే ఈడీ(ED) ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే జూన్ 2న కరోనా బారిన పడిన సోనియా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని సోనియా కోరారని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, ఇదే కేసులో సమన్లు అందుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వచ్చే సోమవారం(జూన్ 13)న ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
రాహుల్ గాంధీ కూడా ఈనెల 2నే విచారణకు హాజరుకావాల్సింది. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేనని రాహుల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈనెల 13న విచారణకు హాజరవ్వాలని ఈడీ తెలిపింది. దీంతో జూన్ 13న ఈడీ విచారణకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో, రాహుల్కు మద్దతుగా అక్బర్ రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ఆ రోజు భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రణాళికలు చేస్తున్నాయి. ఈ మేరకు పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులకు బుధవారం సమాచారం కూడా అందింది. అంతేకాక రాష్ట్రాల్లోనూ ఆ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.
Shocking: బాలికపై అత్యాచారం..నిందితులను కొట్టి పెట్రోల్ పోసి తగులబెట్టిన గ్రామస్తులు..ఒకరు మృతి
మందుబాబులకు గుడ్ న్యూస్..కొత్త పాలసీ..60 శాతం తగ్గనున్న మద్యం ధరలు
నేషనల్ హెరాల్డ్ కేసు
కాంగ్రెస్ లోని కొంతమంది నేతలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్(National Herald) అనే న్యూస్ పేపర్ ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో కథనాలను స్ఫూర్తిదాయక కథనాలను అందించి స్వాతంత్య్ర కాంక్షను రేపింది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ప్రజల్లో ఓ ముద్ర పడింది. స్వాతంత్య్రం అనంతరం ఈ న్యూస్ పేపర్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. తీవ్ర నష్టాల క్రమంలో 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఈఎల్) అనే ప్రైవేట్ సంస్థకు తక్కువ మొత్తానికే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియా లిమిటెడ్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కోశాధికారి పవన్ బన్సాల్లను ఈడీ ప్రశ్నించింది. ఖర్గే వైఐఎల్ సీఈఓగా ఉండగా, బన్సాల్ ఏజేఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు.YIL ప్రమోటర్లలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.