news18-telugu
Updated: December 1, 2020, 10:11 PM IST
శిర్డీ సాయిబాబా ఆలయం
షిరిడీ సాయి బాబాను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఆలయ ట్రస్టు నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే వారు మన దేశ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు. అయితే ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమేనని.. ఇప్పటి వరకు ఖచ్చిమైన డ్రెస్ కోడ్ ఏదీ విధించలేదని ఆలయ ట్రస్టు బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయమై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు.
గతంలో కొందరు అభ్యంతరకర దుస్తులతో ఆలయంలోకి రావడంపై ఫిర్యాదు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఇది కేవలం తమ విన్నపం మాత్రమే అని ఆయన అన్నారు. అయితే.. భక్తులకు ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదని బాగటే స్పష్టం చేశారు.
కాగా.. కరోనా కారణంగా రద్దయిన షిరిడీ సాయి దర్శనాలు.. దాదాపు 8 నెలల తర్వాత ఇటీవల ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధలను పాటిస్తూ భక్తులను ఆలయానికి అనుమతిస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. గంటకు 900 చొప్పున ప్రతి రోజు 6000 మందిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. దర్శనం కోసం ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 65 ఏళ్లు పైబడిన వారిని, 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలను అనుమతించడం లేదని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే కరోనా సమయంలో షిరిడీ రాలేని భక్తుల కోసం ఆన్లైన్ వేదికగా లైవ్ దర్శనం ఏర్పాటు చేశారు. ఈ వెబ్ లింక్ ద్వారా ఆన్లైన్ లో షిరిడీ సాయిని దర్శించుకోవచ్చు.
షిరిడీ సాయి లైవ్ దర్శనం కోసం ఈ
లింక్ క్లిక్ చేయండి.
Published by:
Nikhil Kumar S
First published:
December 1, 2020, 9:54 PM IST