Delhi Fire Accident: అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు
Delhi Fire Accident: అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం (Delhi Fire Accident) జరిగింది. గోకల్పురి ప్రాంతంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలిపోయి దుర్మరణం చెందారు. గోకల్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే పెద్ద ఎత్తున గుడిసెలు తగులబడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. తెల్లవారుఝామున 4 గంటల సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఐతే అప్పటికే 60 గుడిసెలు తగులబడ్డాయి. పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఒక్కో గుడిసెను తనిఖీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో శవాలు బయటపడ్డాయి. మొత్తం ఏడుగురి శవాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు ఈ శాన్య ఢిల్లీ డీసీపీ పేర్కొన్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా కాలిపోయాయని వెల్లడించారు.
We recovered 7 charred bodies which are unrecognisable, it seemed that these people were sleeping & couldn't escape as the fire spread extremely fast. 60 huts were also completely burnt. We are yet to know the reasons behind the fire: Atul Garg, Delhi Fire Director pic.twitter.com/zP4F12qqRG
ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదశాత్తు జరిగిందా? లేదంటే ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలను ఇవాళ సీఎం కేజ్రీవాల్ పరామర్శించనున్నారు. ఆ సమయంలో వారికి ఎక్స్గ్రేషియా అందజేసే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.