హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India : నేడే రైజింగ్ ఇండియా సమ్మిట్ ప్రారంభం.. ఇండియా జర్నీని సెలబ్రేట్‌ చేయడానికి వేదిక

Rising India : నేడే రైజింగ్ ఇండియా సమ్మిట్ ప్రారంభం.. ఇండియా జర్నీని సెలబ్రేట్‌ చేయడానికి వేదిక

రైజింగ్ ఇండియా సమ్మిట్

రైజింగ్ ఇండియా సమ్మిట్

Rising India :networkన్యూఢిల్లీలో నిర్వహించనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023కి(Rising india summit 2023) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Rising India :networkన్యూఢిల్లీలో నిర్వహించనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023కి(Rising india summit 2023) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్ మార్చి 29, 30 తేదీలలో న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరుగుతుంది. ఇవాళ మొదటి రోజు సమ్మిట్ మొదటి రోజు అయిన ఇవాళ మధ్యాహ్నాం 3:20గంటలకు అధికారికంగా ప్రారంభం అవుతుంది. స్వాగత ప్రసంగం మరియు ఏవీ ప్రదర్శన ఉంటుంది. అనంతం 3 :23 గంటలకు పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీ అభయ్ భూతాడ ఓపెనింగ్ అడ్రస్ చేస్తారు. విదేశాంగ మంత్రి జై శంకర్ 3:26కి ఇండియాలో జీ20 సమ్మిట్ గురించి మాట్లాడతారు. 4:15 గంటలకు 'India stack:Highway To Growth'అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ ప్రారంభం అవుతుంది. NPCI సీఈవో దిలీప్ ఆస్బే,నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యమ్, కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ సెక్రటరీ కే.రాజరామన్ ఈ ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొంటారు.

ఈ రెండు రోజుల (29,30)సదస్సు నిర్వహించడానికి న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. భారతదేశం ప్రపంచంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో, ఒక థాట్-లీడర్‌షిప్ కాంక్లేవ్‌గా జరుగనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, గ్లోబల్‌ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న ఇండియా జర్నీని సెలబ్రేట్‌ చేసుకోవడానికి రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023 వేదికగా నిలువనుంది. ఈ ఈవెంట్‌ ద్వారా ప్రపంచంలో భారతదేశం ఎలా మార్పు తీసుకురాగలదనే విషయాలను తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ , ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, పియూష్ గోయల్,ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి,అనురాగ్ ళాకూర్,మన్సుఖ్ మాండవీయ,భూపేందర్ యాదవ్,జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఫిజిక్స్ వాలా సీఈవో అలక్ పాండే, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ,నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.

ఈ సమ్మిట్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నెన్స్‌, ఆర్ట్స్‌, బిజినెస్‌, విద్యాసంస్థల సహా వివిధ రంగాలకు చెందిన గౌరవనీయమైన నాయకుల చర్చా వేదికగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా, నీతి ఆయోగ్ సీఈవో B.V.R సుబ్రహ్మణ్యం వంటి థాట్‌ లీడర్స్‌ పాల్గొనే అనేక ప్యానెల్‌ డిస్కషన్‌లు ఉంటాయి. ఈ సంవత్సరం సమ్మిట్ థీమ్‌ని 'ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా'గా నిర్ణయించారు. ఇందులో భాగంగా సోషల్, కమ్యూనిటీ నేతృత్వ కార్యక్రమాల ద్వారా అట్టడుగు స్థాయిలో మార్పు తెచ్చిన సాధారణ పౌరులను సత్కరిస్తారు. ఈ రియల్‌ లైఫ్‌ హీరోలు వినూత్న పరిష్కారాలను రూపొందించారు, జీవితాలను మార్చే సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వెంచర్‌లను ప్రారంభించారు.

Amit Shah: జమ్మూ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక వేత్తలకు అమిత్ షా పిలుపు

ఈ సందర్భంగా న్యూ స్ 18 నెట్‌వర్క్ CEO, అవినాష్ కౌల్ మాట్లాడుతూ.. ‘భారతదేశం సంపన్న దేశంగా ఎదుగుతుండటం చూసి న్యూస్‌ 18 నెట్‌వర్క్‌ గర్వంగా ఫీల్‌ అవుతోంది. మేము ప్రతి నెలా 69 కోట్లకు పైగా భారతీయులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం చూపడంలో సహాయపడే వార్తలు, కన్వర్జేషన్లు అందించడంలో నిమగ్నమవుతున్నాం. రైజింగ్ ఇండియా భారతదేశంలో గొప్ప థాట్‌ లీడర్‌షిప్‌ ఫోరంలలో ఒకటిగా గుర్తింపు సాధించింది.’ అని చెప్పారు.

పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ భూతాడ మాట్లాడుతూ.. ‘వ్యక్తులు తమ కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు సాధికారత కల్పించే లక్ష్యంతో మా అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ విజన్‌కు సహకరించడానికి, బలమైన, మరింత సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కలిసి పని చేయడానికి మేము సంతోషిస్తున్నాం.’ అని తెలిపారు.

First published:

Tags: Delhi, Network18

ఉత్తమ కథలు