హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit: రాజస్థాన్ సీఎం గెహ్లోత్‌కు ముప్పు తప్పదని అర్థమైంది..కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్

Rising India Summit: రాజస్థాన్ సీఎం గెహ్లోత్‌కు ముప్పు తప్పదని అర్థమైంది..కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్

రైజంగ్ ఇండియా సమ్మిట్ లో కేంద్ర జలశక్తి మంత్రి, గజేంద్ర షెకావత్‌

రైజంగ్ ఇండియా సమ్మిట్ లో కేంద్ర జలశక్తి మంత్రి, గజేంద్ర షెకావత్‌

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ తనను ముప్పుగా భావిస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరుగుతున్న రైజింగ్ ఇండియా కాన్‌క్లేవ్ థర్డ్‌ ఎడిషన్‌లో గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై గెహ్లోత్‌ చేసిన ఆరోపణలపై మాట్లాడారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Rising India Summit: కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌(Rajasthan CM Ashok Gehlot) తనను ముప్పుగా భావిస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra singh Shekhawat) అన్నారు. గురువారం ఢిల్లీలో జరుగుతున్న రైజింగ్ ఇండియా కాన్‌క్లేవ్(Rising India Summit) థర్డ్‌ ఎడిషన్‌లో గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై గెహ్లోత్‌ చేసిన ఆరోపణలపై మాట్లాడారు. వివిధ ఆరోపణలకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

* అందుకే కేసు పెట్టాను?

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ..‘2019లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసేందుకు జోధ్‌పూర్ నాకు సపోర్ట్‌ ఇచ్చింది. తన కుమారుడు వైభవ్ గెహ్లోత్‌ ఓడిపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. మూడు లక్షల ఓట్లకు పైగా తేడాతో ఓటమి చెందడంతో జీర్ణించుకోలేకపోయారు. ఒక క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎక్కడో డబ్బును స్వాహా చేసింది. నా మూడు తరాలకు దానితో సంబంధం లేదు. కానీ అశోక్‌ గెహ్లోత్‌ నన్ను దానితో ముడిపెట్టారు. నేను దాని పూర్వపు డైరెక్టర్‌కి వ్యక్తిగతంగా కొంత వాటాను మాత్రమే ఇచ్చాను. అతని ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. అందుకే నేను క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టాల్సి వచ్చింది. ఆయన నా తల్లిని, కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారు.’ అని చెప్పారు.

* ఏజెన్సీలను దుర్వినియోగం చేశాడు

ఏళ్లుగా జోధ్‌పూర్ రాజకీయాలకు గెహ్లోత్‌ మాత్రమే కేంద్రంగా ఉన్నారని, ఆయన స్థాయికి ఎవరూ చేరుకోలేకపోయారని కేంద్ర జలశక్తి మంత్రి అన్నారు.

ప్రజలను జైలుకు పంపేందుకు ఏజెన్సీలను దుర్వినియోగం చేశారని, అదే ఆయన రాజకీయమని చెప్పారు. గెహ్లోత్‌కు తొలిసారిగా జోధ్‌పూర్‌లో ముప్పు కనిపించిందని, తనకు 4,75,000 ఓట్లు వచ్చాయని, భారతీయ జనతా పార్టీ (BJP) అన్ని స్థానిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించిందని తెలిపారు. గెహ్లోత్‌ తన తిరోగమనాన్ని చూస్తున్నారని గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

* రాజస్థాన్‌లో మోదీ హవా చాలు

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి షెకావత్ మాట్లాడుతూ.. ‘మాకు ప్రధాని మోదీ , ఆయన దేశానికి చేసిన సేవ చాలు. మోదీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాలకు మాకు సీఎం ముఖం అవసరం లేదు. మోదీ హవా చాలు.’ అని అన్నారు.

* మోదీ హయాంలో ఇండియాను ఎవరూ ఆపలేరు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్‌పై దుష్ప్రచారం చేశారని, ఆయనపై చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన మార్గాలను ఉపయోగించలేదని షెకావత్ చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్య హక్కులపై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘భారతదేశం శక్తి, ఔన్నత్యం పెరిగేకొద్దీ, చాలా మంది ఇబ్బంది పడతారు. వ్యాఖ్యలు పెరుగుతాయి... కానీ ప్రధాని మోదీ హయాంలో భారతదేశ వృద్ధిని ఎవరూ ఆపలేరు. భారత ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో న్యాయవ్యవస్థ ఒకటి... అతను క్షమాపణలు చెప్పి తప్పించుకుని ఉండవచ్చు. గతంలో ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించినప్పుడు ఆయన ఆ పని చేశారు. కానీ దానికి బదులుగా మీరు సానుభూతి పొందేందుకు, వివాహితుడిగా మారడానికి, విదేశాలకు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రయత్నిస్తారు. ఇంత పెద్ద పార్టీ..లేదా ప్రధానమంత్రిని గద్దె దింపేందుకు వారు ఇంతకన్నా ఏం చేయగలరు.’ అని అన్నారు.

Amit Shah: ‘మోదీ 2019 కంటే ఎక్కువ సీట్లతో 2024లో ప్రధాని అవుతారు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్‌ షా

* రాహుల్‌ ఏ సంస్థనూ గౌరవించరు

రాహుల్‌ గాంధీపై షెకావత్ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్‌ ఏ సంస్థను గౌరవించరని, 2018లో రాఫెల్ విషయంలో ఇది గమనించామని, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక తర్వాత కూడా వివాదాలను ఆపలేదని చెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత మాత్రమే వెనక్కి తగ్గారని చెప్పారు. యువత, దేశ భవిష్యత్తును తమ ఉజ్వల భవిష్యత్తుతో ముడిపెడుతున్న తరుణంలో, ఇలాంటి చేష్టలు పని చేయవని తెలుసుకోవాలని హెకావత్‌ హితవు పలికారు. గాంధీని ఎంపీగా అనర్హులుగా ప్రకటించడంపై ప్రతిపక్షాల ఐక్యతపై కూడా స్పందించారు. 2018, 2019లో వారంతా ఒక్కటయ్యారని, ప్రధాని మోదీ దేశం కోసం పని చేస్తుంటే, ప్రతిపక్షాలు ఆయనను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వారి కలయిక మొదటి సారి కాదని చెప్పారు.

First published:

Tags: Ashok Gehlet, Ashok gehlot, Rajastan

ఉత్తమ కథలు