పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా అందులో ఆయనకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. వైరస్ బారిన పడ్డ రంగసామి చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి సిబ్బంది ఈ విషయాన్ని మీడియాకు తెలిపింది. రంగసామి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా చాలా మంది సీనియర్ రాజకీయనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి గత శుక్రవారం(మే 7) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే ఆయన కరోనా బారిన పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cm rangaswamy, Corona positive, Puducherry, Rangaswamy, Tamilnadu