హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pm Modi: కార్గిల్ సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు..ఆర్మీ జవాన్లను చూస్తుంటే గర్వంగా ఉందంటూ..

Pm Modi: కార్గిల్ సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు..ఆర్మీ జవాన్లను చూస్తుంటే గర్వంగా ఉందంటూ..

Credit to: Twitter

Credit to: Twitter

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కార్గిల్ సైనికులకులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జవాన్లకు స్వీట్లు పంపిణీ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కార్గిల్ సైనికులకులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జవాన్లకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ..సైనికుల మధ్య దీపావళి పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జవాన్ల త్యాగం మరువలేనిది. దేశ రక్షణలో సైన్యం సేవలు మరువలేనివి. దేశభక్తి దైవభక్తితో సమానమని ప్రధాని మోడీ  (Narendra Modi) అన్నారు. ఆర్మీ జవాన్లను చూస్తుంటే గర్వంగా ఉందని, సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని కొనియాడారు. సైనికులు దేశానికి రక్షణ స్థంబాలు అని ప్రధానమంత్రి మోడీ అభివర్ణించారు.

Diwali 2022 : దీపావళిని ఆ దేశాల్లో కూడా జరుపుకుంటారు..ఆ పేర్లతో దీపావళి సెలబ్రేషన్స్

ప్రధాని అయిన తర్వాత మోదీ నిరంతరం సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్నారు. ప్రధాని అయిన తర్వాత సియాచిన్‌లో సైనికులతో కలిసి తొలిసారి దీపావళి జరుపుకున్నారు. ఇదే సమయంలో గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

Prime Minister Shri @narendramodi has landed in Kargil, where he will celebrate Diwali with our brave soldiers. pic.twitter.com/RQxanDEgDK

— PMO India (@PMOIndia) October 24, 2022

దీపావళి పండుగ రోజున ప్రధాని మోదీ  (Narendra Modi) నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. 2015లో  ప్రధాని మోదీ పంజాబ్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2016లో దీపావళి జరుపుకునేందుకు హిమాచల్‌లోని కిన్నౌర్‌కు  మోదీ వచ్చారు. ఇక్కడ ఇండో-చైనా సరిహద్దు దగ్గర సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు.

రావణుడి మృతదేహం ఇప్పటికీ అక్కడ ఉందంట, అది ఎలా ఉంటుందో తెలుసా?

2017లో కూడా సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్‌కు చేరుకున్నారు. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్షిల్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సైనికులతో కలిసి ప్రధానమంత్రి దీపావళిని జరుపుకున్నారు. అదే సమయంలో 2019లో అతను నియంత్రణ రేఖపై సైనికులతో దీపావళి జరుపుకున్నాడు. ఈ సందర్భంగా నియంత్రణ రేఖపై మోహరించిన సైనికులను కలిసేందుకు మోదీ రాజౌరీ చేరుకున్నారు.  కోవిడ్ మహమ్మారి మధ్య కూడా 2020 సంవత్సరంలో జైసల్మేర్‌లోని లోంగేవాలా పోస్ట్‌లో సైనికులతో కలిసి ప్రధాన మంత్రి దీపావళిని జరుపుకున్నారు. కాగా ఈసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కార్గిల్ సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండుగ మన జీవితాల్లో వెలుగు, ఆనందాలను నింపడమే కాదు. సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నా. మీరు మీ కుటుంబం, స్నేహితులతో కలిసి అద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

First published:

Tags: Diwali, Pm modi

ఉత్తమ కథలు