హోమ్ /వార్తలు /national /

‘అందుకే తాడిపత్రికి వచ్చిన లోకేశ్’

‘అందుకే తాడిపత్రికి వచ్చిన లోకేశ్’

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ యువనేత లోకేశ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ యువనేత లోకేశ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జేసీ దివాకర్ రెడ్డిని పరామర్శించేందుకు తాడిపత్రికి వచ్చిన నారా లోకేశ్ ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట అంటూ కామెంట్ చేశారు. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం అంటూ లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కూడా విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. గంటకు 5 లక్షల ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వొకేట్ల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారట తెలుగుదేశం మాజీలు అంటూ ఎద్దేవా చేశారు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులూ బాస్ కోసం అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఈయన కాపాడలేడు అనుకున్నారేమో ఎవరికి వారు లాయర్లకు అడ్వాన్సులిచ్చి గండం నుంచి బయట పడేయమని ప్రాధేయడుతున్నారట అంటూ వ్యాఖ్యానించారు.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Vijayasai reddy

ఉత్తమ కథలు