హోమ్ /వార్తలు /national /

trs వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్.. సంకర నేతలతో ఏమీ కాదు : మంత్రి puvvada ajay

trs వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్.. సంకర నేతలతో ఏమీ కాదు : మంత్రి puvvada ajay

ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్‌ వరకు రైతుల ఖాతాల్లో రూ.2,661 కోట్లు జమ అయ్యాయి. ఈ యాసంగి సీజన్‌కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి.

ఖమ్మం జిల్లాలో 2018 వానకాలం నుంచి ఈ యాసంగి సీజన్‌ వరకు రైతుల ఖాతాల్లో రూ.2,661 కోట్లు జమ అయ్యాయి. ఈ యాసంగి సీజన్‌కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల రైతుబంధు నిధులు మంజూరయ్యాయి.

కరీంనగర్ లోనైతే రెబల్స్ గెలిచేశామంటూ అప్పుడే సంబురాలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీ క్రాసింగ్స్ జరిగినా గెలుపు మాత్రం గులాబీదళానిదే అంటున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. స్థానిక ఎంపీ, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇంకా చదవండి ...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా అధికార టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు జంప్ కొట్టడం, ఇతర పార్టీల నేతలు కారెక్కడం లాంటి దృశ్యాలు అన్ని జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. కరీంనగర్ లోనైతే రెబల్స్ గెలిచేశామంటూ అప్పుడే సంబురాలు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీ క్రాసింగ్స్ జరిగినా గెలుపు మాత్రం గులాబీదళానిదే అంటున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. స్థానిక ఎంపీ, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాడు పోలింగ్ జరగ్గా, వచ్చే మంగళవారం(ఈనెల 14న) ఫలితాలు వెలువడనున్నాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఐక్యంగా పనిచేశారని, గులాబీ దళమే విజయకేతనం ఎగరేస్తుందని నేతలు దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఫలితాల్లో ఎమ్మెల్సీగా తాతా మధు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని నేతలు చెప్పారు.

Hyderabad : వామ్మో! ఆ మహిళల మలద్వారంలో బంగారం పేస్ట్ -ఇలాంటిది తొలిసారి..



టీఆర్ఎస్ అంటే ఒరిజినల్ బ్రీడ్ అని, ఎన్ని క్రాసింగ్​లు జరిగినా.. క్రాస్ బ్రీడ్​లు వచ్చినా.. విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తాతా మధుకి వచ్చే విజయం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు. భారీ మెజార్టీ సాధిస్తాం. ఏ క్రాసింగైనా.. క్రాస్ బ్రీడ్​ అయినా వస్తుంటాయ్.. పోతుంటాయి. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. టీఆర్ఎస్ అంటేనే ఒరిజినల్ బ్రీడ్..’ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.


karimnagar మేయర్ సునీల్ రావు సంచలన ప్రకటన.. అదే జరిగితే పదవికి రాజీనామా..



ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్​సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, ప్రజాకంటక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.

First published:

Tags: Khammam, Mlc elections, Puvvada Ajay Kumar, Trs

ఉత్తమ కథలు