భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశం కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారని ఆయన సోదరుడు సోమాభాయ్ మోడీ (Somabhay Modi) అన్నారు. అయితే తాను నరేంద్ర (Narendra Modi) ను విశ్రాంతి తీసుకోవాలని కోరానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ సోమాభాయ్ (Somabhay Modi) ఎమోషనల్ అయ్యారు. 2014 నుంచి జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు విస్మరించలేరని అన్నారు. నేను ఓటర్లకు ఇచ్చే సందేశం ఒకటే. వారు వారి ఓట్లను సద్వినియోగం చేసుకోవాలి. కాగా అహ్మాదాబాద్ (Ahmadabad) లో ఓటేసిన అనంతరం సోమాభాయ్ మోడీ (Somabhay Modi) ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | PM Modi's brother Somabhai Modi gets emotional as he talks about PM who visited him earlier today
People cannot ignore the kind of work Centre has done after 2014. I asked him (PM Modi) that he works a lot for the country, he should take some rest as well: Somabhai Modi pic.twitter.com/3SrGMj6A6O
— ANI (@ANI) December 5, 2022
ఓటేసిన మోదీ, అమిత్ షా, మోదీ తల్లి హీరాబెన్, సోదరుడు సోమాభాయ్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో (Gujarat Assembly Elections) రెండో విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అహ్మదాబాద్ లోని రానిప్ ఉన్నత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ (Narendra Modi) ఓటేసేందుకు వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ప్రధాని రాగానే లేచి నిల్చున్నారు వారిని కూర్చోమని మోదీ (Narendra Modi) చెప్పారు. అనంతరం పోలింగ్ బూత్ లో ఓటేసిన మోదీ (Narendra Modi) బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా చుక్క ఉన్న వేలును చూపించారు.
అహ్మదాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అతని కొడుకు జైషా ఓటు వేశారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్, సోదరుడు సోమాభాయ్ మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ గవర్నర్ ఆనంది బెన్, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఓటు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Gujarat Assembly Elections 2022, Modi, PM Narendra Modi