రాయలసీమను సుజల సీమగా చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ జనసేన పిలుపునిచ్చింది. సుజల సీమ పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాయలసీమలోని మేధావులు, విజ్ఞులు, వివిధ రంగాల నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మార్చి 1 నుంచి ‘సుజల సీమ విభాగం’ అందుబాటులో ఉండనుంది. ఈ విభాగానికి లేబాక శ్యామ్, బి.కృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. సుజల సీమకు సంబంధించి ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే వారికి తెలియజేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సమాచారాన్ని అందించవచ్చని జనసేన పార్టీ కోరింది. విజయవాడ మైనేని రోడ్లో ఉన్న కడియాల వెంకయ్య కస్తూరి భవన్లో జనసేన కార్యాయంలో తెలపాలని సూచించింది. ఒకవేళ వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వాలనుకునే వారు 6304900785 నెంబర్ ద్వారా తెలియజేయాలని కోరింది.
సుజల సీమ pic.twitter.com/c5bXie0tHf
— JanaSena Party (@JanaSenaParty) February 29, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Rayalaseema