హోమ్ /వార్తలు /national /

మదనపల్లెలో పవన్ కళ్యాణ్‌కు షాక్.. అక్కడకు నో ఎంట్రీ...

మదనపల్లెలో పవన్ కళ్యాణ్‌కు షాక్.. అక్కడకు నో ఎంట్రీ...

పీలేరులో పవన్ కళ్యాణ్

పీలేరులో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మార్కెట్ యార్డును సందర్శించేందుకు పవన్ కళ్యాణ్‌కు మార్కెట్ యార్డు అధికారులు అనుమతి నిరాకరించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మార్కెట్ యార్డును సందర్శించేందుకు పవన్ కళ్యాణ్‌కు మార్కెట్ యార్డు అధికారులు అనుమతి నిరాకరించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈనెల 5న మదనపల్లెలోని మార్కెట్ యార్డుకు వెళ్లి టమాట రైతులను కలవాలని భావించారు. అయితే, సీజన్ ప్రారంభం కావడంతో పవన్ రాక వల్ల టమోటా రైతులకు ఇబ్బంది అవుతుందని మార్కెట్ యార్డు అధికారులు చెప్పారు. మార్కెడ్ యార్డు అధికారుల తీరుపై పవన్ విమర్శలు గుప్పించారు. ‘మీ అనుమతి ఎవరికి కావాలి, మార్కెట్ యార్డుకు రానీయకుంటే రోడ్డుపైనే కూర్చుంటా. మీకున్న 150 సీట్లు నాకు రెండు వేళ్లతో సమానం. మీరు ఎంత ఆపితే అంత మందుకెళ్తా, మేం సింహాలం.. మేకలం కాదు.’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో రేపు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది.

First published:

Tags: Chittoor, Janasena party, Pawan kalyan

ఉత్తమ కథలు