సీబీఐ డైరెక్టర్ నియామకం వాయిదా పడింది. డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు గురువారం సాయంత్రం సమావేశమైన ప్రధాని మోదీ నేత్రుత్వంలోని హైపవర్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరం మేరకు సీబీఐ డైరెక్టర్ నియామకం వాయిదా పడినట్టు చెబుతున్నారు.
సీబీఐ డైరెక్టర్ పదవి కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఐపీఎస్ అభ్యర్థులకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని, అలాగే వాటిని పరిశీలించడానికి ఇంకాస్త సమయం కావాలని ఖర్గే కమిటీతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, షార్ట్ లిస్ట్ను మరింత కుదించి కేవలం ఐదారుగురు సీనియర్ అధికారులతో ఫైనల్ షార్ట్ లిస్ట్ తయారుచేయాల్సిందిగా ఖర్గే సూచించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా గతంలో వినీత్ నరైన్ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖర్గే గుర్తుచేసినట్టు తెలుస్తోంది.సంబంధిత శాఖకు సంబంధించిన అనుభవంతో పాటు, సమర్థత, సీనియారిటీ ప్రాతిపదికనే సీబీఐ చీఫ్ పదవిని భర్తీ చేయాలని సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను ఆయన కమిటీ సభ్యులకు గుర్తుచేసినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి : నేడే సీబీఐ డైరెక్టర్ నియామకం.. రేసులో ముందున్న ఆ ఐదుగురు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Mallikarjun Kharge, Narendra modi