చిదంబరం అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఓ ఫోటోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మరో మహిళ ఆ ఫోటోలో ఉన్నారు. అయితే ఆ మహిళను చిదంబరం భార్య నళినీ చిదంబరంగా పేర్కొంటూ.. వీరు ముగ్గురు కలిసి చిదంబరంను విడిపించడానికి ఢిల్లీ బయలుదేరినట్టుగా ఆ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన లోకేష్..అదంతా ఫేక్ ప్రచారం అని చెప్పారు. జఫ్ఫాలు మరోసారి పట్టుబడ్డారని.. పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజలను ప్రతీసారి ఫూల్స్ చేయలేరని మండిపడ్డారు.ఇక ఆ ఫోటోలో ఉన్నది నళిని చిదంబరం కాదని.. 'వనజ అనబడే నేను' ఆ మహిళ స్వయంగా ట్విట్టర్లో స్పందించారు.ఒకరిని మించి ఒకరు సోషల్ మీడియాలో అబద్దాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆమె ట్విట్టర్ పోస్టును లోకేష్ 'ఫేక్ అలర్డ్' అంటూ షేర్ చేశారు.
FAKE ALERT!!
— Lokesh Nara (@naralokesh) August 22, 2019
JAFFAS CAUGHT AGAIN!
PayTM Batch members didn't know they can fool all the people sometimes, but not all the times!
😄😆😅😂🤣#FekuJagan #FekuJaffas https://t.co/ijhRPEu0kc
మీరు అసలు ఏ లోకంలో ఉన్నారు నాకైతే అర్ధం కావడం లేదు...అసలు ఆ ఫోటో లో ఉన్నది నళిని చిదంబరం కాదు...వనజ అనబడే నేను... అయ్యినా ఒకర్ని మించి ఒకరు అబ్బాద్దాలు పొద్దుటనుంచి సృష్టిస్తూ ఉన్నారు...🙏..@VSReddy_MP @naralokesh @ysjagan #Iamnotnalinichidambaram #Iamvanajachallagulla pic.twitter.com/BqM25uF9Oj
— Iam_1aja (@vanajachallagu1) August 22, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chidambaram, Nara Lokesh, Ramoji rao, Tdp