హోమ్ /వార్తలు /national /

బ్రాహ్మణి అకౌంట్‌లో అమ్మ ఒడి డబ్బులు.. సోషల్ మీడియాలో వైరల్

బ్రాహ్మణి అకౌంట్‌లో అమ్మ ఒడి డబ్బులు.. సోషల్ మీడియాలో వైరల్

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పూజలు చేస్తున్న నారా లోకేష్, బ్రాహ్మణి

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పూజలు చేస్తున్న నారా లోకేష్, బ్రాహ్మణి

నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అకౌంట్‌కి కూడా రూ.15వేలు జమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా దేవాన్ష్ చదువుల కోసం డబ్బులు అందాయని ఓ ఫొటో షికారు చేస్తోంది.

ఏపీలో గురువారం అమ్మ ఒడి పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ తల్లికి అకౌంట్లో రూ.15 వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమచేసింది. అర్హులైన వారందరికీ డబ్బులు పంపించారు. ఐతే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అకౌంట్‌కి కూడా రూ.15వేలు జమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నారా దేవాన్ష్ చదువుల కోసం డబ్బులు అందాయని ఓ ఫొటో షికారు చేస్తోంది. దీనిపై ట్విటర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. అది ఫేక్ ఫొటో అని.. ఇందులో నిజం లేదని ఖండించారు.

అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారు. అర్హుల సంఖ్య సగానికి కోసారు. వైకాపా పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది. మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ గారి దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతా.
నారా లోకేష్

First published:

Tags: AP News, Nara Brahmani, Nara Lokesh

ఉత్తమ కథలు