మెరీనా తీరంలో కలైంజర్ కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. అన్న(అన్నాదురై), అమ్మ(జయలలిత) మెమోరియల్స్ మధ్య కలైంజర్ సమాధి అయ్యారు. తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కలైంజర్ సమాధి చేసే సమయంలో అభిమానులు గుండెలు పగిలేలా రోదించారు. ఇక కరుణానిధి కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య తుది విడ్కోలు పలికారు.
తమిళ సూరీడు శాశ్వతంగా అస్తమించాడు. మెరీనా తీరంలో అన్న, అమ్మ మెమోరియల్స్ మధ్య కలైంజర్ సమాధి అయ్యారు. తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కలైంజర్ సమాధి చేసే సమయంలో అభిమానులు గుండెలు పగిలేలా రోదించారు. దాంతో చెన్నై సముద్ర తీరం శోక సంద్రంగా మారింది. మెరీనా బీచ్కు వెళ్లే రోడ్లు ఇసుకేస్తే రాలనంతంగా జనంతో కిక్కిరిసిపోయాయి. అశ్రునయనాల మధ్య తమ అభిమాన నేతలకు కడసారి వీడ్కోలు పలికారు అభిమానులు.