హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Karnataka Floor Test | కర్ణాటకలో నేడు బలపరీక్ష.. 1.30 డెడ్‌లైన్ పెట్టిన గవర్నర్

Karnataka Floor Test | కర్ణాటకలో నేడు బలపరీక్ష.. 1.30 డెడ్‌లైన్ పెట్టిన గవర్నర్

సీఎం కుమారస్వామి(File)

సీఎం కుమారస్వామి(File)

Karnataka Floor Test | నేటి మధ్యాహ్నం 1.30లోపు అసెంబ్లీలో ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు.

శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కర్ణాటకలో అధికార పార్టీ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ఆయన తన ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గురువారమే బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి స్పీకర్ రమేష్ కుమార్‌కు ఆదేశాలు వచ్చాయి. అయినా సరే నిన్న సభలో బలపరీక్ష జరగలేదు. సభ నేటి ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ వాజుభాయ్ వాలా సీఎం కుమారస్వామికి లేఖ రాశారు. నేటి మధ్యాహ్నం 1.30 లోపు బలపరీక్ష నిర్వహించాలని సూచించారు.

First published:

Tags: Congress-jds, Hd kumaraswamy, Karnataka bjp, Karnataka political crisis, Siddaramaiah, Yeddyurappa

ఉత్తమ కథలు