కర్నాటక కేబినెట్ కొలువు తీరింది. సీఎం యడియూరప్ప ఇవాళ కేబినెట్ ఏర్పాటు చేశారు. తన టీఎంలో 17మందికి అవకాశం కల్పించారు. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 17మందితో ఇవాళ ఎదయం 10:30 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. యడియూరప్ప గత మైత్రి ప్రభుత్వాన్ని వీడి బిజేపికి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి హెచ్ నగేశ్కు కేబినెట్ పదవి కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 26 రోజుల తర్వాత యడియూరప్ప తన కేబినెట్ కూర్పు పూర్తిచేశారు.
కేబినెట్లో సభ్యులు వీరే
1. గోవింద్ మక్తప్ప
2.అశ్వత్ నారాయణ
3.లక్ష్మణ్ సంగప్ప
4.ఈశ్వరప్ప
5.అశోక
6.జగదీష్
7.శ్రీరాములు
8.ఎస్. సురేష్ కుమార్
9.సోమన్న
10.రవి
11.బసవరాజు
12.శ్రీనివాస్ పూజారి
13.జేసీ మధుస్వామి
14.చిన్నప్పగౌడ పాటిల్
15.హెచ్ నగేష్
16.ప్రభు చౌహాన్
17.శశికళా అన్నా సాహెబ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Karnataka, Karnataka Politics, Yediyurappa