బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఆర్థికశాఖ మంత్రులు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు రావడం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను
ఓ ఎర్రటి జూట్ బ్యాగ్లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు. దానిపై రాజముద్ర కూడా ఉంది. నిర్మలా చేతిలో ఆ బ్యాగ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా కనిపించింది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం దీనిపై స్పందించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తమ ఆర్థికమంత్రి ఐపాడ్తోనే బడ్జెట్ను ప్రవేశపెడుతాడని చిదంబరం అన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్పై స్పందిస్తూ చిదంబరం ఈ కామెంట్ చేశారు.చిదంబరం కామెంట్ ఇలా ఉంటే ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు మాత్రం నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన ఆ బ్యాగ్.. ఇన్నాళ్ల మన బానిసత్వానికి స్వస్తి పలికిందని అన్నారు. పాశ్చాత్య బానిసత్వానికి స్వస్తి పలికి భారతీయ
సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె బహీఖాతాతో వచ్చారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2019 highlights, Chidambaram, Union Budget 2019