హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు బీజేపీ నాయకులను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కులు జిల్లాకు చెందిన ఓ బీజేవైఎం నాయకుడు, ఓ మహిళతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 12.35 నిమిషాలు ఉన్న ఆ వీడియో పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ పెద్దలు ప్రకటించారు. ఆ వీడియోలో ఉన్న మహిళే.. దాన్ని ఆ బీజేవైఎం నేతకు పంపిందని.. అయితే, ఆ వీడియో బీజేవైఎం నేత భార్య కంటపడింది. దీంతో సదరు నేత భార్య.. వీడియోలో ఉన్న యువతికి ఫోన్ చేసి.. తన భర్త వెంట పడొద్దని హెచ్చరించింది. అయితే, ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల సంభాషణ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ వీడియోలను వాట్సాప్ గ్రూప్స్లో ప్రచారం చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Himachal Pradesh